అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ATA ) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు మహేశ్ బిగాల, టీఆర్ఎస్ పార్టీ అమెరికా విభాగం యువకులు ఘన స్వాగతం పలికారు.
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు ఆటా మహాసభలు జరగనున్నాయి. ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ను ఎమ్మెల్సీ కవిత 2వ తేదీన ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం జరిగే ఆటా ప్రైమ్ మీట్ లో పాల్గొనడంతో పాటు ఆటా బతుకమ్మపై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు.