సింగపూర్ : ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్(Singapore) లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యాన ఈ సారి మనబడి(Manabadi )తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. సెప్టెంబర్ 29న అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు స్వామి గోపి కిశోర్ మాట్లాడుతూ.. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం, ప్రస్తుత తరగతులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి పైకండువా కప్పి, మెడల్ తో పాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధృవపత్రాలను బహుకరించామని తెలిపారు.
మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందిస్తూ, మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సాంబశివ రావు, తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి ,ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్, కురిచేటి జ్యోతీశ్వర్, సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, టేకూరి నాగేష్, కురిచేటి స్వాతి, వైదా మహేష్, కొత్త సుప్రియ, ప్రతిమ, దేదీప్య, శ్రీలక్ష్మి, కిరణ్ కుమార్, గోపి కృష్ణ, రంగనాధ్, గీత, శ్రీలత, విజయ వాణి పాల్గొన్నారు.