బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కమిటీలు అన్నీ రద్దయ్యాయి. రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్ఆర్ఐ కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు.
త్వరలోనే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త సభ్యత్వ ప్రతిపాదికన, పద్ధతిగా, వ్యవస్థీకృతంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మార్పుల దశలో అన్ని కమిటీల సభ్యులు, మద్దతుదారులు సహకరించి పార్టీ నాయకత్వం, దాని దూరదృష్టికి తమ మద్దతు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.