మలేషియా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను (KTR Birthday) మలేషియాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాసులు, మలేషియా బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా చేశారు. అనంతరం మలేషియా బీఆర్ఎస్ అధ్యక్షుడు మారుతీ కుర్మ మాట్లాడుతూ.. కేటీఆర్ హయాంలో తెలంగాణకు భారీగా ఐటీ పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో టైర్-2 పట్టణాలకు ఐటీ హబ్లను విస్తరింపజేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా ఫౌండర్ చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షులు మునిగల అరుణ్, కార్యదర్శి , కోర్ కమిటీ సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, గద్దె జీవన్ కుమార్, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, ఇతర సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.