మెల్బోర్న్: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిని గురించి తెలియజేయడంతోపాటు కేసీఆర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి సరైన మాధ్యమంగా క్రికెట్ టోర్నమెంట్ను ఎన్నుకునామని ఆస్ట్రేలియాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి చెప్పారు.
ఈ కేసీఆర్ కప్ టోర్నమెంటులో భారత దేశానికి చెందిన 29 రాష్ట్రాల వారు పాల్గొంటారని, తద్వారా కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండా NRI లు అందరికీ చేరుతుందని నాగేందర్రెడ్డి తెలిపారు. అందుకే తాము క్రికెట్ టోర్నమెంట్ను ఎంచుకున్నామన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ముక్త భారత్ దిశగా ప్రజల ఆలోచన ఉందని, ఇది కేసీఆర్ ద్వారానే సాధ్యమని దేశ ప్రజలు నమ్ముతున్నారని విక్టోరియా స్టేట్ కన్వీనర్ ఉప్పు సాయిరాం తెలిపారు.