అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రంప్ స్వగృహం ‘మార్-ఎ-లాగో’ వేదికగా రిపబ్లిక్ పార్టీ హిందూ కోఅలియేషన్ (ఆర్హెచ్సీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికిపైగా భారతీయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్హెచ్సీ నాయకుల నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను మళ్లీ అమెరికా అధ్యక్షుడైతే వారిని అడ్మినిస్ట్రేషన్లో భాగస్వాములు చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్హెచ్సీ వ్యవస్థాపకుడు శలభ్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించిన ఆయన.. శలభ్ (షల్లీ)ని భారత్లో అమెరికా రాయబారిగా నియమిస్తానని చెప్పారు.
అలాగే భారతీయ లీడర్లు సతీశ్ వేమన, క్రాంతి దూదెం, ఈశ్వర్ రెడ్డి బండ రవి గడ్డంపల్లి తదితరుల శక్తియుక్తులను కొనియాడారు. తాను మళ్లీ అగ్రరాజ్యం అధిపతిగా ఎన్నికైతే పాకిస్తాన్కు మిలటరీ ఆయుధాల అమ్మకాలను నిలిపేస్తానని, ఇప్పటికే అమెరికా అంగీకరించిన ఎఫ్16 యుద్ధవిమానాల అమ్మకాన్ని కూడా ఆపేస్తానని చెప్పారు. అలాగే తనకు భారతీయులన్నా, భారత దేశమన్నా చాలా ప్రేమ అని పేర్కొన్నారు. చివరగా ‘భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు.