Racial Discrimination | అమెరికాలోని ఓ బిజినెస్ స్కూల్పై భారత సంతతికి చెందిన మహిళా ప్రొఫెసర్.. జాతి-లింగ వివక్ష కింద పిటిషన్ దాఖలు చేశారు. మస్సాచుసెట్స్-వెల్లెస్లీ బిజినెస్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన లక్ష్మి బాల చంద్ర తన పట్ల సంస్థ యాజమాన్యం జాతి-లింగ వివక్ష ప్రదర్శించిందని తన పిటిషన్లో పేర్కొన్నారు. బాబ్సన్ కాలేజీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేసిన లక్ష్మి బాల చంద్ర.. తన ఆందోళన, భయాలపై దర్యాప్తులో వైఫల్యం వల్ల తన పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. కెరీర్ అవకాశాలను కోల్పోయాయని, ఆర్థికంగా నష్టపోయానని, భావోద్వేగపూరితంగా దెబ్బ తిన్నానని లక్ష్మి బాలచంద్ర తెలిపారు. ఆమె పిటిషన్ దాఖలు చేసిన సంగతి గత నెల 27న బోస్టన్ గ్లోబ్ న్యూస్పేపర్లో ప్రచురితమైంది.
బాబ్సాన్ కాలేజీలో లక్ష్మి బాలచంద్ర 2012లో ఫ్యాకల్టీగా చేరారు. 2019లో ఆమె టెన్యూర్ ముగిసింది. కాలేజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డివిజన్ మాజీ చైర్-ప్రొఫెసర్ ఆండ్రూ కార్బెట్కు వ్యతిరేకంగా ఆమె పిటిషన్ వేశారు. `వర్క్ ఎన్విరాన్మెంట్ పట్ల వివక్ష ప్రదర్శించడంలో ప్రధాన సూత్రధారి` అని ఆరోపించారు. ఫిబ్రవరి 27న బోస్టన్లోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో ఫిర్యాదు చేశారు. టీచింగ్ అసైన్మెంట్స్, క్లాస్ షెడ్యూలింగ్, యాన్యువల్ రివ్యూస్ వంటి అంశాలపై కార్బెట్ పర్యవేక్షకుడిగా ఉండేవారని అన్నారు. తన అభ్యర్థనలను తోసిరాజని ఎంటర్ట్రెన్యూర్షిప్ తరగతులకు మాత్రమే అనుమతించేవారని ఆరోపించారు. శ్వేత జాతీయులు, పురుష ప్రొఫెసర్లకు అనుకూలంగా వ్యవహరించేవారని ఫిర్యాదు చేశారు.
రీసెర్చ్ రికార్డు, తన ఇంటరెస్ట్లను వెల్లడించినా, కాలేజీకి సర్వీస్ చేసేందుకు సిద్ధమన్నా.. పలు నాయకత్వ స్థానాలు కల్పించడానికి ప్రొఫెసర్ ఆండ్రూ కార్బెన్ నిరాకరించారని లక్ష్మి బాలచంద్ర తెలిపారు. రీసెర్చ్, రచనలకు అవకాశాలు కల్పించలేదన్నారు. ఇటువంటి అవకాశాలు కేవలం పురుష ప్రొఫెసర్లకు మాత్రమే కల్పించేవారని పేర్కొన్నారు. లక్ష్మి బాలచంద్ర పిటిషన్పై బాబ్సన్ కాలేజీ తీవ్రంగానే స్పందించింది. ఆమె ఫిర్యాదులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ కాలేజీలో వివక్షను సహించే ప్రసక్తి లేదని బాబ్సన్ కాలేజీ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం నేషనల్ సైన్స్ ఫౌండేషన్లో ఫెలోషిప్ కోసం లక్ష్మిబాలచంద్ర సెలవులో ఉన్నారు.