* పార్టీ తొలి బహిరంగ సభ ను విజయవంతం చేయాలి
* బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్
హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): గుజరాత్లాంటి నకిలీ మాడల్ కాకుండా తెలంగాణ మాడల్ దేశమంతా అమలైతే దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. స్వరాష్ట్ర ఉద్యమంలో నిర్వహించిన ప్రతి సభా ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
దేశంలో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, దేశాన్ని నడిపించే సమర్థత, చాణక్యం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.