హైదరాబాద్ : భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడానికి , ఏకత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి , కళలకు సరిహద్దులు లేని నిరూపించడానికి ఇండోనేషియా బాలి(Indonesia, Bali ) లో నిర్వహించిన శివపదం గీతాల నృత్యప్రదర్శన (Classical dances) వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నోయువర్ రూట్స్ (యూఎస్ఏ), సంగమం అకాడమీ (ఇండియా) ఆధ్వర్యంలో రుషిపీఠం సహకారంతో నృత్యప్రదర్శన నిర్వహించారు.
యూఎస్ఏ (USA) లో పుట్టి పెరిగిన 45 మంది యువ నర్తకీ, నర్తకులు, గురువులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించి వాటి గొప్పతనాన్ని చాటిచెప్పారు. బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం(Shivapadam) సాహిత్య పద్యాలతో పాటు త్యాగరాజు, అన్నమయ్య, మైసూర్ వాసుదేవాచార్యులు రచించిన సాహిత్యాలకు నృత్య ప్రదర్శన చేశారు.