ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, శుభోదయం గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర్ రావు శతజయంతి సంవత్సరం సందర్భంగా 366 రోజులపాటు ఘంటసాల స్వర రాగ మహాయాగం నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీ నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ 4 వరకు ఈ మహాయాగం కొనసాగనుంది. ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు కొనసాగనుంది. ప్రతి రోజు గాయనీగాయకులచే ఘంటసాల గానామృత, ప్రముఖ రచయితలచే అక్షరనివాళి కార్యక్రమం జరగనుంది.
ఆహ్వానం వీడియో
https://youtu.be/57XjPhF49s4
ప్రారంభవోత్సవ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం (4 డిసెంబర్ 2021, 5:30pm IST)
https://youtu.be/iLa9Ql_UeE8
https://www.facebook.com/events/434635498326769/