హైదరాబాద్ : ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ లెర్న్ చెస్ అకాడమీ(Learn Chess Academy) ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడమీ వార్షిక చెస్ టోర్నమెంట్ 2024(Chess Competitions) సింగపూర్లో ఘనంగ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 6 నుంచి 15 సంవత్సరాల విద్యార్థులు సుమారు 50 మంది పాల్గొన్నారు. సింగపూర్లో (Singapore) యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు చెస్ కోచ్ మురళీ కృష్ణ చిత్రాద దీనిని స్థాపించారు. కాగా, ఇది 15 సంవత్సరాల నుంచి నిరంతరంగా చదరంగం ఆటలో శిక్షణ ఇస్తున్నది.
బహుమతి పంపిణీ కార్యక్రమంలో టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ చైర్మన్ కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సౌందర్య కనగాల, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ ,గోపి చిరుమామిళ్ల పాల్గొన్నారు.