హైదరాబాద్ : అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు(Mla Balraju)పై కాంగ్రెస్ నాయకుల దాడిని బీఆర్ఎస్ (Brs) సౌత్ ఆఫ్రికా శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రజా సేవ కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలువాలని దాడులతో కాదని ఆ శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల హితవు పలికారు. తెలంగాణ లో పది సంవత్సరాలుగా మచ్చుకు కూడా రౌడీయిజం సంస్కృతి లేదని అన్నారు.
మొన్న దుబ్బాకలో, ఈరోజు అచ్చంపేట లో దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని, కనీసం ఆ పార్టీ నాయకులకు ఓటర్ల వద్ద చెప్పుకోవడానికి ఏమి లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు ఓటుతో పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు.