BRS NRI | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, కుటుంబాలను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఖమ్మం పర్యటనలో పాల్గొని వారికి ధైర్యాన్నందించి, భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల సమస్యలను తెలుసుకొని, వారికి న్యాయం జరిగేలా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర హామీ ఇచ్చారు.
ఈ సందర్భంలో ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ తమ సంఘీభావాన్ని తెలియజేస్తుందని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా బాధిత రైతులకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు.
అక్కడ జరిగిన కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజుకు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు బాధితుల వద్దకు వెళ్లి వారికి సహాయ సహకారాలు అందిస్తూ, ఎన్నో మంది కుటుంబాలకు ధైర్యం, భరోసా కల్పిస్తూ నిరంతరం అండగా నిలుస్తున్నారని నాగరాజు గుర్రాల అభినందించారు.
