హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ(Brs Party) ఆవిర్భావ వేడుకలను లండన్(London) నగరం లోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్ఎస్(NRI) యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే(MLA) కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిథిగా ఎఫ్డీసీ చైర్మన్(FDC Chairman) అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి, అమరవీరులని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పార్టీ జెండా ఎగరేసి, ‘ దేశ్ కి నేత కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూతెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనకోసం ఎన్నారైలంతా క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు.పార్టీ కార్యక్రమాలతో పాటు ఎన్నారై ఆడబిడ్డలు బతుకమ్మ(Bathukamma)ను, బోనాల(Bonalu)ను సైతం మరువకుండా తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అభినందించారు.సాధించుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR)కు పార్టీలో పని చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ దేశవ్యాప్తం ఎదగటానికి ఎన్ఆర్ఐలు ప్రముఖ పాత్ర పోషిస్తారని వెల్లడించారు.
ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వయిజరీ బోర్డు ఉపాధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ముఖ్యనాయకులు సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్, సతీష్ రెడ్డి బండ, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, రమేశ్ ఎసెంపల్లి, మాదిరెడ్డి నవీన్ రెడ్డి, ప్రశాంత్, సురేష్ గోపతి, ప్రశాంత్ మామిడాల, మధు యాదవ్ మరియు ప్రవాస సంఘాల నాయకులు గణేష్ కుప్పం, రంజిత్, స్వాతి బుడగం, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శ్రావ్య, విద్య, స్నేహ, పావని, మాధవ్, దీపాక్షర, రవి కిరణ్, వంశీ పాల్గొన్నారు.