బహ్రెయిన్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.
గల్ఫ్ దేశాలలో సుమారు 88 లక్షల ప్రవాస భారతీయులు, 15 లక్షల తెలంగాణ వారు ఉపాధి పొందుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మొన్న మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగెట్టేలా చేసే వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస 88 లక్షల మంది భారతీయులు వారి ఉపాధిని కోల్పోయి రోడ్డుమీద పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భార్య పిల్లలను వదిలి నాలుగు రూపాయలు సంపాదించు కుందామని వస్తే ఈలాంటి మత విద్వేషాలను రెచ్చగొడితే గల్ఫ్ దేశాలలో స్నేహ బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. మూడేండ్ల కింద అబుదాబిలో భారత ప్రధాని మోదీ హిందూ దేవాలయానికి పునాది రాళ్లు వేసి గల్ఫ్ దేశాలలో హిందూ దేవాలయాలను కట్టుకోవడానికి వారు అవకాశం కల్పించారు.
కానీ, బండి సంజయ్ మసీదులను తవ్వుదాం..శవాలు బయటపడితే మీకు, శివ లింగాలు బయటపడితే మే తీసుకుంటాం అని రెచ్చగొట్టే ప్రసంగాలను చేసిన సంజయ్ వెంటనే బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.