హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ పట్టణాలలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిడ్నలో రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా రాజేష్ రాపోలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి 10 సంవత్సరాల పాటు బంగారు తెలంగాణను సాధించే దిశగా కృషి చేసిన కేటీఆర్ పాత్ర చరిత్లో నిలిచిపోతుందని, పార్టీ ఓడిన, గెలిచిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఎప్పటికీ పార్టీ తోనే ఉంటుందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా సిడ్నీలో రవీందర్ చింతామణి ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఈ వేడుకలలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు రవీందర్ చింతామణి, పరశురాం ముత్తుకూల్ల, లివింగస్టన్ చిట్టిపల్లి, సాయి గుప్త, చిరాన్ పురంశెట్టి, మధుకర్ సుతారి, శ్రీనివాస్ సుతారి, రాజకుమార్ నరేట్టి తదితరులు పాల్గొన్నారు.