హైదరాబాద్ : ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకు ఒక అందం అని సినీ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపుడి అన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాతగా 18 సెప్టెంబర్ 2022న జరిగిన అంతర్జాల కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు వి. న్. ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, ప్రముఖ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, ప్రముఖ నేపధ్య గాయనీమణులు గీత మాధురి, మాళవిక, ప్రముఖ నేపధ్య గాయకులు, ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ రోహిత్, అనురూప్, యూఎస్.ఏ నుంచి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్.ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, భారతదేశం నుంచి లక్ష్మయ్య మంత్రి తదితరులు పాల్గొన్నారు.
ముందుగా వి.న్.ఆదిత్య మాట్లాడుతూ.. ప్రభుత్వాలు పూనుకొని చేయాల్సిన పనిని మనమందరం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద. స్వాతంత్ర సమరయోధుడు, వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడి అలరించారన్నారు. ఘటంసాల భారతరత్నకి అర్హులు అని తెలియచేసారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకు ఒక అందం తప్పా.. వారికి కొత్త అలంకరం ఏమి కాదన్నారు. ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని డిజిటలైజ్ చేసి బావి తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైనా ఉందన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ..ఈ కార్యక్రమం చాలా చాలా గొప్ప కార్యక్రమం. ఘంటసాల సంగీతంలో గాన గంధర్వుడు. వారు ఒక మంచి గాయకుడే కాకుండా 100 పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారన్నారు. ఘంటసాలను భారతరత్నతో సత్కరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివారాల కోసం కింది లింక్లో చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.
https://www.change.org/BharatRatnaForGhantasalaGaru ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి ghantasala100th@gmail.com వివరాలు పంపించాలని నిర్వాహకులు తెలిపారు.