హైదరాబాద్ : నమో వెంకటేశా నమో తిరుమలేశా పాటతో మా చిన్నతనంలో గ్రామాల్లో నిద్రలేచే వారమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా సినీ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో 10 మంది సహ నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, నీలిమ గడ్డమణుగు, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతల తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయనీ గాయకులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించారు.
మొదటి రెండు భాగాల్ని ఆగస్టు 21, 28న ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. అలాగే 4 సెప్టెంబర్ మూడో భాగం ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చివరి భాగం 11 సెప్టెంబర్ ప్రసారం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. నమో వెంకటేశా నమో తిరుమలేశా పాటతో నిద్రలేచే మేము అదే పాటతో మళ్లీ రాత్రి నిద్రపోయే వారమని అంటే ఆ పాట మా అందరికి మేలుకొలుపు అలాగే జోలపాట అని తెలియజేశారు. ఘంటసాల మాస్టారు..ఎంతో నిబద్ధతో పని చేసేవారన్నారు.
తన గాత్రం, స్వాతంత్య్రోద్యమంలో ఎందరికో ప్రేరణగా నిలిచిన ఆయనకు భారతరత్న రావడం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరాం పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి ghantasala100th@gmail.com వివరాలు పంపాలని నిర్వాహకులు సూచించారు.
కార్యక్రమంలో భాస్కర్ గంటి, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ గూడూరు, రవి తుపురాని, వనమాల గుంటపల్లి, నీహార్ కపిల, శిల్ప ఉప్పులూరి, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకర్ దర్భా, రవి కామర్సు ,శ్రీనివాస్ ఇయ్యుణ్ణి, మురళి హనుమంతకారి, ప్రభాకర్ కోట, ఆషా కీర్తి లంకా, ప్రత్యూష మందడపు, పరిమళ మార్పాక, జానకి శంకర్, వీణ యలమంచిలి, ఆదిషేషు కోట, దాము గేదల, రమేష్ వల్లూరి, మధు అన్న, రాజషేఖర్ రెడ్డి ఐల, చిమట శ్రీనివాస్, విజయ సారధి జీడిగుంట, సంతోష్ ఆకునూరి