హైదరాబాద్ : తెలుగు భాషకు చెందిన ‘అవధాన ప్రక్రియ’ను దేశ విదేశాలకు పరిచయం చెయ్యాలనే సంకల్పంతో సహస్ర అవధాని వద్దిపర్తి పద్మాకర్ ‘సప్త ఖంఢ అవధాన సాహితీ ఝరి’కి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా ఒక్కొక్క ఖండం చొప్పున దాదాపు 20కిపైగా దేశాల నుంచి పలువురు పాల్గొనగా.. అంతర్జాలంలో 12 అష్టావధానాలు పూర్తి చేశారు. అవధానంలో కెనడా నుంచి సాహితీ ప్రియులు, దక్షిణ అమెరికాకు చెందిన పెరూ నుంచి శ్రీనివాస్ పోలవరపు సైతం పాల్గొన్నారు. అవధానంలో కంచి కామకోటి పీఠానికి చెందిన పీఠాధిపతి జగద్గురువు విజయేంద్ర సరస్వతీ హాజరై ఆశ్వీరదించారు. అశధానం ఆధ్యాంతం ఎంతో రసవత్తరంగా, కనులపండువలా సాగగా.. సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులను అలరించింది.
ఈ సందర్భంగా పలువురు సాహిత్యాభిమానులు మాట్లాడుతూ.. ఇలాంటి సభలే తెలుగు భాషను కలకాలం నిలుపుతాయని హర్షం వ్యక్తం చేశారు. వద్దిపర్తి పద్మాకర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘శ్రీ ప్రణవ పీఠం’స్థాపించారు. సంగీత, సాహీత్యాల్లో సమప్రతిభ, తెలుగుతో పాటు సంస్కృతం, హిందీ భాషల్లోనూ ప్రావీణ్యం ఉన్నది. తెలుగు భాషని, సంస్కృతిని నిలబెట్టడానికి పలు ఆధ్యాత్మిక యాత్రలని చేస్తుంటారు. ఏడు ఖండాల్లో జరిగిన ఈ 12 అవధానాలతో కలిపి ఇప్పటికి 1242 అష్టావధానాలు, 12 శతావధానాలు, 8 జంట అవధానాలు, తెలుగు, సంస్కృతం, హిందీలో ఏకకాలంలో మహా సహస్రావధానం చేసి.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలుగు బుక్ ఆఫ్ రిక్డార్స్లో చోటు సాధించారు.