లండన్ : ఎన్నారై టీఆర్ఎస్ యూకే (లండన్) శాఖ నేడు పదకొండో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఖండాంతరాల్లో గులాబీ జెండా మోసే అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అశోక్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
లండన్ వేదికగా ప్రారంభమైన ఎన్నారై టీఆర్ఎస్ శాఖ మొదటి రోజు నుంచి నేటి వరకు ఎంతో క్రియాశీలకంగా పని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. అలాగే మమ్మల్ని నడిపిస్తున్న ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంకు కృతజ్ఞతాభినందనాలు తెలియజేస్తున్నట్టు అశోక్ తెలిపారు.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి సోషల్ మీడియా మిత్రుల సహకారం ప్రోత్సాహం ఎల్లపుడూ ఇలాగే ఉండాలని, ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ గతంలో లాగానే భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో, క్రమశిక్షణతో పని చేస్తుందన్నారు. కేసీఆర్ ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్నామని అశోక్ తెలిపారు.
ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి మమ్మల్ని సమన్వయ పరుస్తున్న మహేష్ బిగాలకు, ప్రోత్సహిస్తున్న ప్రపంచవ్యాప్త ఎన్నారై టీఆర్ఎస్ శాఖల నాయకులకు, కార్యకర్తలకు, ఎన్నారై మిత్రులకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.