హైదరాబాద్ : వాషింగ్టన్ డీసీ వేదికగా జులై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగబోయే 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఆటా మహాసభలను నిర్వహించనున్నారు.
ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్ కాట్స్ అధ్యక్షులు సతీష్ వడ్డీ, ఇతర కీలక సభ్యులు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే (డోనార్స్ ) అతిథుల కోసం రవాణా, భోజన, హోటల్ వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు లేనివిధంగా ఈసారి మేరీల్యాండ్, వర్జీనియా నుంచి వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వరకు షటిల్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నారు.
ఆటా మహాసభలకు మొట్టమొదటి సారిగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కూడా హాజరు కానున్నారు. పద్మవిభూషణ్ ఇళయరాజా, సంగీత దర్శకుడు థమన్, గాయకుడు రామ్ మిరియాల కూడా ఆటా మహాసభలకు వెళ్లనున్నారు.
అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో ఆటా 17వ మహాసభలు విజయవంతం చేయాలని కోరారు.
టికెట్స్ కోసం>>> www.ataconference.org/buy-tickets
ఇతర వివరాల కోసం>> www.ataconference.org