హైదరాబాద్ : తెలంగాణ పౌర సమాజం తలెత్తుకునేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్(NRI BRS Bahrain Branch ) శాఖ పేర్కొంది. శుక్రవారం భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రటరీలు రాజేందర్ మగ్గిడి, సుమన్ అన్నారం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
భారత దేశంలోనే తలమానికంగా అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టించడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బీఆర్అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల సీఎం కేసీఆర్(CM KCR)కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక అసమానతల(vision of equality) నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగాలనే దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
కేంద్రం సమాఖ్య స్ఫూర్తి కి విరోదంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నదని వారు ఆరోపించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది దళితులపై దాడులు జరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణమని పేర్కొన్నారు. అట్టడుగు స్థానంలో ఉన్న దళిత సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్ అడుగడుగునా రాజ్యాంగ నిర్మాతను కొలుస్తూ అంబేద్కర్ చూపిన బాటలోనే పయనిస్తున్నారని అన్నారు.