న్యూఢిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) 2021-22 సంవత్సరానికి గాను ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ను అందిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మాక్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం ఖాళీలు: 38
ఇందులో మిషన్ మోటార్ వెహికిల్ విభాగంలో 3, డ్రాట్స్మెన్ 4, ఎలక్ట్రానిక్ మెషిన్ 5, ఇన్ట్రుమెంట్ మెషిన్ మెకానిక్ 6, లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) 6, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసిఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 27 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
స్టయిఫండ్: కోపా.. రూ.7700, మిగిలిన విభాగాలకు రూ.8050
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 29
వెబ్సైట్: https://drdo.gov.in, https://rac.gov.in/