న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ గ్రేడ్-ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఇవి జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్, రిసెర్చ్, అధికారిక భాష విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నది.
మొత్తం పోస్టులు: 120
ఇందులో జనరల్ విభాగంలో 80, లీగల్ 16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 14, రిసెర్చ్ 7, అఫీషియల్ లాంగ్వేజ్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: లా, ఇంజినీరింగ్లో డిగ్రీ, పీజీ, సీఏ, సీఎఫ్ఏ, సీఎస్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో, హిందీలో పీజీ చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 24
వెబ్సైట్: www.sebi.gov.in