న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో భాగమైన సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 16 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ వర్క్షాప్లు, యూనిట్లలో 2422 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 2422
ఇందులో ముంబైలో 1659, భుస్వాల్లో 418, పుణె 151, నాగ్పూర్ 114, షోలాపూర్ 79 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐఐటీ, మెట్రిక్యులేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 16
వెబ్సైట్: https://rrccr.com/