న్యూఢిల్లీ: రైల్వేలో మౌలికవసతులు కల్పించే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (RCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 23 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 69 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్ డిపార్ట్మెంట్లలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం ఖాళీలు: 69
ఇందులో డిప్యూటీ మేనేజర్ 52, మేనేజర్ 10, సీనియర్ మేనేజర్ 7
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీగానీ ఇంజినీరింగ్ గానీ చేయాలి, ఎంబీఏ, మార్కెటింగ్, టెలికమ్, ఐటీలో పీజీ డిప్లొమా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్బీ చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 34 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 23
వెబ్సైట్: https://railtel.cbtexam.in/