హైదరాబాద్: విదేశాల్లో చదుకోవడానికి వెళ్లిన బీసీ, ఓబీసీ విద్యార్థుల నుంచి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లకు రాష్ర్ట ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఫాల్ సెషన్లో విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థులు నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు www.telanganaepass.cgg. gov.in చూడవచ్చు.