Power Grid Recruitment 2023 | 138 ఇంజినీర్ ట్రెయినీ (Engineer Trainees) పోస్టుల భర్తీకి పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ (ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు.. గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఏప్రిల్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 138
పోస్టులు : ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ తదితరాలు.
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు.. గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 18
వెబ్సైట్ : www.powergrid.in