న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) మరో భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. 535 ఖాళీలతో గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరాఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 23వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు అసోం, అరుణాచల్ప్రదేశ్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 535
ఇందులో ఎలక్ట్రీషియన్ 38, ఫిట్టర్ 144, మెకానిక్ మోటార్ వెహికల్ 42, మెషినిస్ట్ 13, డీజిల్ మెకానిక్ 97, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 40, బాయిలర్ అటెండెంట్ 8, టర్నర్ 4, డ్రాట్స్మెన్ సివిల్ 8, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 81, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 44, సర్వేయర్ 5, వెల్డర్ 6, ఐటీ అండ్ ఈఎస్ఎం 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, ఇంటర్ పాసై, అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 23
వెబ్సైట్: https://www.oil-india.com