న్యూఢిల్లీ: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (NLC) ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. డిప్లొమా, డిగ్రీ చేసిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 550 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 250, డిప్లొమా ఇంజినీరింగ్ 300 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం అప్రెంటిస్లు: 550
ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 155, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 20, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 20, సివిల్ ఇంజినీరింగ్ 70, మెకానికల్ ఇంజినీరింగ్ 165, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 45, కెమికల్ ఇంజినీరింగ్ 10, మైనింగ్ ఇంజినీరింగ్ 50, ఫార్మసీ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో డిప్లొమా, ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 10
వెబ్సైట్: https://www.nlcindia.in/