న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్హెచ్పీసీ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తికలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 17 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. అందేవిధంగా ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేస్తున్నది. గేట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
మొత్తం పోస్టులు: 67
ఇందులో సివిల్ ఇంజినీర్లు 29, మెకానికల్ 20, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 4, ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్ 12, కంపెనీ సెక్రటరీ 2 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో ఇంజినీరింగ్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సీఎ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్, సీఏ, సీఎంఏ, సీఎస్ స్కోర్ ఆధారంగా.
అప్లికేషన్ ఫీజు: రూ.295, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: 2022 జనవరి 17
వెబ్సైట్: www.nhpcindia.co