ముంబై: ప్రభుత్వ రంగ చమురు సంస్థ అయిన భారత్ పెట్రోలియం లిమిటెడ్ (బీపీసీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరకాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 21 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ముంబైలోని బీపీసీఎల్ రిఫైనరీలో ఏడాదిపాటు శిక్షణను అందిస్తారు.
మొత్తం అప్రెంటిస్లు: 87
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 42 (కెమికల్ 11, సివిల్ 8, ఎలక్ట్రికల్ 5, ఐటీ 3, ఇన్స్ట్రుమెంటేషన్ 2, మెకానికల్ 13), టెక్నీషియన్ అప్రెంటిస్ 45 (కెమికల్ 5, సివిల్ 7, ఎలక్ట్రికల్ 8, ఇన్స్ట్రుమెంటేషన్ 8, మెకానికల్ 17)
అర్హత: సంబంధిత బ్రాంచీ లేదా ట్రేడ్లో బీటెక్, బీఈ, డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 2019 తర్వాత ఉత్తీర్ణులై, 18-27 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
స్టయిఫండ్: రూ.25,000, రూ.18000
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 21
వెబ్సైట్: http://www.bharatpetroleum.in/