న్యూఢిల్లీ: మహారత్న కంపెనీ అయిన కొచ్చిన షిప్యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మొత్తం 70 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, నవల్ ఆర్కటెక్చర్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 70
ఇందులో సివిల్ 2, ఎలక్ట్రికల్ 19, ఎలక్ట్రానిక్స్ 2, మెకానికల్ 37, నావల్ ఆర్కిటెక్చర్ 6, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2, హ్యూమన్ రిసోర్స్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. 2021, అక్టోబర్ 27 నాటికి 27 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 27
వెబ్సైట్: www.cochinshipyard.in