న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 15 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 511 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంజినీరింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఈ పోస్టులను రెండు, ఏడాది కాలపరిమితికి భర్తీచేస్తున్నారు. అభ్యర్థి పనితీరునుబట్టి పదవీకాలం పొడిగింపు ఉంటుంది.
మొత్తం పోస్టులు: 511
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 308 (జనరల్ 124, ఈడబ్ల్యూఎస్ 31, ఓబీసీ 83, ఎస్సీ 47, ఎస్టీ 23), ప్రాజెక్ట్ ఇంజినీర్ 203 (జనరల్ 84, ఈడబ్ల్యూఎస్ 21, ఓబీసీ 54, ఎస్సీ 30, ఎస్టీ 14) చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 28/25 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: బీఈ, బీటెక్లో వచ్చిన మార్కులు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్కు రూ.500, ప్రాజెక్ట్ ఇంజినీర్కు రూ.200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 15
వెబ్సైట్: http://bel-india.in/