న్యూఢిల్లీ: రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (BARC) సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గేట్ స్కోర్ లేదా ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్)లలో ఏదో ఒకటి చేసి, 26 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్2021 22లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11
వెబ్సైట్: barconlineexam.in