న్యూఢిల్లీ: భారత వాయుసేనలో గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 282 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సూపరింటెండెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, కుక్, పెయింటర్ వంటి పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 7-13 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ను ప్రచురించారు.
మొత్తం పోస్టులు: 282
ఇందులో మెయింటెనెన్స్ కమాండ్ 153, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ 32, సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ 11, ఇండిపెండెంట్ యూనిట్స్ 1, కుక్ 5, మెస్ స్టాఫ్ 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18, హౌస్ కీపింగ్ 15, హిందీ టైపిస్ట్ 3, లోయర్ డివిజన్ క్లర్క్ 10, స్టోర్ కీపర్ 3, కార్పెంటర్ 3, పెయింటర్ 1, సివిలియన్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, ఎల్డీసీ, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్ పోస్టులకు పన్నెండో తరగతి, ఇతర పోస్టులకు పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులవాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 7
వెబ్సైట్: indianairforce.nic.in