బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామంలోని బస్స్టాప్ వద్ద ఆదివారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని ఆరో వార్డులో నీటి సమస్య ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.