నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కొనసాగుతున్న ఈవెంట్స్లో భాగంగా మూడో రోజు శనివారం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పరీక్షలను పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు పర్యవేక్షణలో సాయం త్రం వరకు నిర్వహించారు. వెయ్యి మంది అభ్యర్థులను పిలువగా 879 మంది అభ్యర్థు లు హాజరయ్యారు.
ఉదయం నుంచి అభ్యర్థు ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్తో పా టు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన వారికి ఈవెంట్స్ నిర్వహించారు. పరుగుపందెం, ఎత్తు కొలత, షాట్ఫుట్, లాంగ్జంప్ ఈవెంట్స్లో 640 మంది అభ్యర్థులు ఎంపికైనట్లుగా వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. తాగునీటిని సదుపాయం, మెడికల్ టీమ్స్, అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ఈ శారీరదారుఢ్య పరీక్షలు ఈ నెల 22వ తేదీ వర కు కొనసాగుతాయని వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీ సీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధ న్, సీసీఎస్, హోమ్గార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కె. ఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతో ష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులుతో పాటు పోలీస్ వెల్ఫేర్ దవాఖాన డాక్టర్ సరళ, ఫిజికల్ డైరెక్టర్స్, పీఈటీలు సిబ్బంది పాల్గొన్నారు.