ముప్కాల్, జనవరి 23: మహిళలు ఆర్థికం గా ఎదగడానికి, వారి అభ్యున్నతికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు కృషి చేస్తుందని ఆ బ్యాంక్ చైర్పర్సన్ శోభ అన్నా రు. ముప్కాల్ మండలంలోని రెంజర్లలో బ్యాంక్ నూతన భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణాల కోసం ప్రైవేటు బ్యాంకుల వెంట తిరిగి అధిక వడ్డీలు చెల్లిస్తూ మోసపోవద్దని సూచించారు.
వ్యవసాయ రుణాలు, ఎస్హెచ్జీలు, ఆధునిక యూనిట్ల అవసరం కోసం టర్మరిక్ బాయిలర్, చాప్ కట్టర్, ముద్రా రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మగ్గం, బ్యూటీపార్లర్ యూనిట్లను చైర్పర్సన్ శోభ ప్రారంభించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ డీవీఎస్ రామారావు, ముప్కాల్ ఏపీఎం ప్రసాద్రావు, సర్పంచ్ ఆకుల రాజారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ హన్మాండ్లు, సిబ్బంది సందీప్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.