వినాయక నిమజ్జన శోభాయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పట్టణాల్లో గురువారం నిర్వహించారు. నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, బాల్కొండ తదితర మండలాల్లో భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. కామారెడ్డి జిల్లాలో రథాలకు చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. వినాయక శోభాయాత్రలో చిన్నా, పెద్ద తేడా లేకుండా యువతీయువకులు కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేశారు.