ఎటు చూసినా పచ్చదనం.. వివిధ రకాల పూల మొక్కలు.. మధ్యలో దివి నుంచి భువికి దిగి వచ్చాడా అన్నట్లుగా కొలువుదీరిన శివుడి విగ్రహం.. సేద దీరడానికి ఏర్పాటు చేసిన భవనం.. మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా స్నానాల గదులు.. పరిశుభ్రతతోపాటు ఆహ్లాదం పంచుతున్నది సత్యనారాయణపురంలోని వైకుంఠధామం.
ప్రతి మనిషి ఆఖరి ప్రయాణం ప్రశాంతంగా ముగిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాలను నిర్మిస్తోంది. ఇందులో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ స్వర్గపురిగా మారుస్తోంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణ పురం గ్రామంలోని వైకుంఠ ధామాన్ని కోటి రూపాయలతో నిర్మించారు. దాతలు, గ్రామ ప్రజలు , రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుందరంగా తీర్చిదిద్దడంతో ఇతర గ్రామాలకు మోడల్గా నిలుస్తోంది.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్