విద్యానగర్/ ఇందల్వాయి, డిసెంబర్ 16 : యువత, ఎన్సీసీ కేడట్లలో దేశ ఐక్యత, దేశభక్తి, ఆరోగ్యం, కష్టపడే తత్వం,క్రమశిక్షణ పెంపొందించడానికి ఎన్సీసీ కల్నల్ కేఎస్ బద్వార్ బృందం చేపట్టిన యూనిటీ ఫ్లేమ్ రన్ శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ రన్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు పది రాష్ర్టాల మీదుగా మూడు వేల కిలోమీటర్ల వరకు కొనసాగనున్నది. శనివారం నిర్వహించిన రన్లో జిల్లా యంత్రాంగం పాల్గొంది. ఈ రన్ను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. అం తకుముందు జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిమ్ ను కలెక్టర్ పరిశీలించారు. జిమ్ను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ అన్యోన్య, క్రీడల అధికారి దామోదర్రెడ్డి, ఎన్సీసీ బెటాలియన్ కమాండెం ట్ ఆఫీసర్ ఆర్ఎస్ రాథోడ్, ఏఎన్వోలు రామస్వామి, వీరేందర్ గౌ డ్, ఇస్మాయిల్, బస్వారాజ్, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
యూనిటీ ఫ్లేమ్ రన్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రానికి చేరుకోగా.. అడిషనల్ ఎస్పీ అరవింద్బాబు, ఎన్సీసీ కెడెట్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కల్నల్ కేఎస్ బద్వార్ సాయుధ దళాల్లో చేరడానికి వయస్సు, అర్హత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇందల్వాయి ఎస్సై నరేశ్, 7వ బెటాలియన్ టీఎస్ ఎస్పీ కమాండెంట్ ఎన్వి.సత్యశ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.