Kotagiri | కోటగిరి, జూలై 20 : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట యువ నాయకుడు మొరిల్ శ్రీనివాస రావు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు భారీ ఎత్తున తరలి వెళ్లారు.
ఉమ్మడి కోటగిరి మండలం నుండి 60 వాహనాలలో ప్రతీ పల్లె నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తెలంగాణ భవన్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు మోరే కిషన్, డాక్టర్ హకీమ్, తేళ్ల రవికుమార్, సూదం నవీన్ , సమీర్, సయ్యద్ ఫారుక్, దేవేందర్, శ్రీనివాస్ గౌడ్, మోరే గౌతమ్, నజీర్, కప్ప సంతోష్, సందీప్ , ఆరీఫ్, ఏజాజ్ , అజ్మీర్ కిషన్, రాజు, విజయ్ తదితరులు ఉన్నారు.