ధర్పల్లి, డిసెంబర్ 6 : ఒకప్పుడు దారి దోపిడీకి నెలవైన ఆ ప్రాంతం.. రానురాను భక్తులు కొంగు బంగారంగా మారింది. దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి సోయగంతో కనువిందు చేస్తున్న ధర్పల్లి మండల కేంద్రంలోని మద్దుల్ లక్ష్మీనరసింహుడు.. కోరి కొలిచిన భక్తులకు అభయమిస్తూ కొండం త అండగా నిలుస్తున్నాడు. స్వామివారు వెలిసినప్పటి నుంచి ప్రజల్లో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి.
మద్దుల్ అటవీ ప్రాంతంగుండా వెళ్తున్న ఓ భక్తుడు అలసిపోయి కునుకుతీశాడు. లేచి చూస్తే పక్కనే స్వామివారి విగ్రహం కనిపించింది. దీంతో తన సంసారంలో చిక్కులు తొలగించాలని మొక్కుకున్నాడు. అంతే.. అనతికాలంలోనే ఆ భక్తుడి కష్టాలన్నీ దూరమయ్యాయి. దీంతో స్వామివారికి అక్కడే ఆలయం నిర్మించి పూజ లు చేశాడు. ఆ ఆలయం దినదినాభివృద్ధి చెం దుతూ ఆపదలు తొలగించే లక్ష్మీనరసింహుడిగా బాసిల్లుతున్నాడు.
ధర్పల్లి మండలకేంద్రంలోని హారాలాల్ ప్రభులాల్ బీడీ కంపెనీ యజమాన్యం, టేకేదార్లు కలిసి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. భక్తులే తమ శక్తిమేరకు సౌకర్యాలను కల్పిస్తున్నా రు. ఏటా హెచ్పీ బీడీ కంపెనీ ఆధ్వర్యంలో జాత ర నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
ధర్పల్లి నుంచి ఇందల్వాయికి వెళ్లే ప్రధాన రోడ్డులోని ఐదు కిలోమీటర్ల దూరంలో మద్దుల్ అట వీ ప్రాంతంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఆలయంలో ఏటా దత్తజయంతి రోజు జాతర ఉత్సవాలను అంత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జాత ర, భక్తులకు అన్నదానం నిర్వహించడానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ కమిటీ అధ్వర్యంలో జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేశాం. ఏటా జాతరకు భక్తులు పెద్ద సంఖ్య లో తరలివస్తారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్నదానం కూడా నిర్వహిస్తాం.
-చెలిమెల రాములు, ఆలయ కమిటీ చైర్మన్