పిట్లం, డిసెంబర్ 26: కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన 11 మంది యువకులు సైకిళ్లపై అయోధ్యకు బయల్దేరారు. వారి ర్యాలీ పిట్లం గ్రామానికి మంగళవారం చేరుకున్నది. పిట్లం గ్రామానికి చెందిన యువకులు బొమ్మల దేవేందర్, దేమె అరవింద్ వారికి పండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. 21 రోజుల పాటు సైకిల్ యాత్ర చేపట్టి అయోధ్యకు చేరుకుంటామని యాత్రికులు అజయ్శర్మ, విజయ్శర్మ, ఉదయ్శర్మ, సాయినాథ్, భువనేశ్, ఆమేశ్, జగదీశ్, విష్ణు, అభిషేక్, హన్మంతు తెలిపారు.