కామారెడ్డి/ ఖలీల్వాడి, మే 24 : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 29, నిజామాబాద్ జిల్లాలో 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్ 1171 మంది విద్యార్థులకు 1089 మంది,ఒకేషనల్ 304 మంది విద్యార్థులకు 274 మంది హాజరైనట్లు హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ 523 మంది విద్యార్థులకు 488 మంది, ఒకేషనల్ 76 మంది విద్యార్థులకు 73 మంది హాజరైనట్లు వివరించారు. నిజామాబాద్ జిల్లాలో ఫస్టియర్ పరీక్షలకు 3,662 మంది విద్యార్థులకు 3,335 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,498 మందికి 1396 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు.