జక్రాన్పల్లి, ఫిబ్రవరి 3 : మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో ఉన్న ఆనందగిరి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అర్చకుల ఆధ్వర్యంలో శుక్రవారం గరుడ పఠాధివాసం, ధ్వజారోహణం, హోమంతోపాటు అభిషేకం, అలంకరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. శని, ఆదివారాల్లో నిర్వహించే కల్యాణం, రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
డిచ్పల్లి, ఫిబ్రవరి 3 : మండలంలోని ఘన్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి సపరివార దేవతా ప్రతిష్ఠాపనా మహోత్సోవాన్ని శుక్రవారం నిర్వహించారు. అనామిత దేవతా పూజ, హోమం, యంత్ర, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, ప్రాణ ప్రతిష్ఠాపనలు, పూర్ణాహుతి, విగ్రహాలకు అభిషేకం, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం తదితర కార్యక్రమాలను సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుర్రి సవితా రామకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శక్కరికొండ కృష్ణ, ఉపసర్పంచ్ ముదిగొండ రంజిత్, విండో డైరెక్టర్ సతీశ్రెడ్డి, వీడీసీ సభ్యులు పెద్దపల్లి భూమయ్య, నూకల రాజు, మొచ్చ మహేశ్, కుమ్మరి ముత్యం, సాకలి చిన్న గంగారాం, కేశం పెద్ద సాయిలు, కొత్తోళ్ల చిన్న దేవయ్య, మీసాల గంగారాం, బండి సాయిలు, కర్దూరం కిషన్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎన్నోళ్ల రాజు పాల్గొన్నారు.