ఖలీల్వాడి/ కంఠేశ్వర్, ఫిబ్రవరి 11: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో విజయవంతమయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన వాహనాల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొందరు నచ్చిన వాహనాలను నడిపి ఆనందించారు. యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని స్టాళ్లను సందర్శించారు. నిజామాబాద్తోపాటు హైదరాబాద్కు చెందిన వివిధ కంపెనీల వాహనాలు జిల్లావాసులను ఆకట్టుకున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చిన వాహనప్రియులు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వాహనాల వివరాలను తెలుసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సందర్శకులతో స్టాళ్లు కిటకిటలాడాయి.
ఆటో షోలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్తో కూడిన వాహనాలు అందరినీ ఆకర్షించాయి. బెంజ్, ఆడి, వోల్వో, ఎంజీ కంపెనీలకు చెందిన హైఎండ్ మోడల్స్ గురించి తెలుసుకున్నారు. కియా, నెక్సా, విటారా, మహింద్రా తదితర కంపెనీలకు చెందిన కార్లను ఆసక్తిగా తిలకించారు. కాలుష్యరహిత వాహనాలైన ఎలక్ట్రిక్ బైక్లు, కార్లను ప్రజలు సందర్శించారు. హోండా, హీరో, చెతక్, టీవీఎస్ తదితర కంపెనీలకు చెందిన వాహనాలను బుకింగ్ చేశారు. మొత్తం 36 వాహనాలను నిర్వాహకులు విక్రయించారు. ఈ సందర్భంగా కొంతమంది కొనుగోలుదారులకు ఆటోషో ప్రాంగణంలోనే వాహనాలను అందజేయడం విశేషం. వాహనాల కొనుగోలుకు ముందుకు వచ్చే వారి కోసం రుణ సౌకర్యం కల్పించేందుకు బ్యాంక్ స్టాల్ను సైతం ఏర్పాటు చేశారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహించిన ఆటోషోతో ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చినట్లుగా మారింది. ప్రజల్లో కొత్త వాహనాలపై ఆసక్తి పెంచింది. ఆటోషో విజయవంతం కావడంపై స్టాళ్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తంచేశారు. ముగింపు సందర్భంగా లక్కీ విజిటర్ బహుమతిని ఓంకార్, మాజిత్ఖాన్ అందుకున్నారు. లక్కీ కొనుగోలుదారుగా ఎంపికైన క్రాంతికు యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ హిబ్రం బహుమతులను అందజేశారు. అనంతరం స్టాళ్ల నిర్వాహకులకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో మెమెంటో అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ కడార్ల శ్రీకాంత్, అసిస్టెంట్ సర్క్యులేషన్ మేనేజర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ ఆటోషో చాలా బాగున్నది. ఎప్పుడు చేసినా హైలెట్గా నిలుస్తున్నది. ఇతర షోలతో పోలిస్తే చాలా బాగున్నది. అన్నిరకాల కంపెనీలు ఒకే వేదిక వద్దకు తీసుకురావడం సంతోషకరం. నమస్తే తెలంగాణ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.
నిజామాబాద్కి అన్ని కంపెనీలు రావడం చాలా బాగున్నది. విశాలమైన మైదానంలో సుందరంగా ఏర్పాటుచేశారు. కస్టమర్లకు కనువిందు చేసేలా ఉన్నాయి. గ్రీన్ హోండా షోరూంలో ఒక కారు బుకింగ్ అయ్యింది. ప్రారంభ ధర రూ.8.25లక్షల నుంచి రూ.25లక్షల వరకు కార్లు ఉన్నాయి.
నమస్తే తెలంగాణ ఆటోషో కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. అన్ని రకాల కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చి కస్టమర్లు వారికి ఇష్టమై న వాహనాలు కొనుగోలు చేసేలా ప్రయత్నించడం అభినందనీయం. హైదరాబాద్లో ఉండే మా ఎమ్జీ షోరూం కార్లని నిజామాబాద్ ప్రజలకు తెలిసేలా పబ్లిసిటీ చేశారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆ ధ్వర్యంలో 2021లో నిర్వహించిన ఆ టో షో కార్యక్రమానికి కస్టమర్గా వ చ్చాను. ప్రస్తుతం ప్రైడ్ జీప్ అసిస్టెంట్ సేల్స్మేనేజర్గా మా కార్లు ప్రదర్శనకు తీసుకువచ్చాం. చాలా సంతోషంగా ఉ న్నది. ఈ సారి పబ్లిక్సిటీ చాలా బాగా చేశారు. రెస్పాన్స్ బాగున్నది.
నిజామాబాద్లో నమస్తే తెలంగా ణ నిర్వహించిన ఆటోషోలో అన్ని విధాలా సహాయసహకారాలు అం దించారు. ముఖ్యంగా ప్రజల నుం చి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా షోరూం కార్ల ప్రారంభ ధర రూ. 6.16లక్షల నుంచి రూ.9.7లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి.
ఆటోషో ఏర్పాటుతో బైక్లకి భలే గిరాకీ వచ్చింది. చాలా మంది సందర్శకులు వచ్చారు. ఇలాంటి ప్రదర్శన చాలా బాగున్నది. 8 మోడల్స్ సరసమైన ధరలో లభిస్తున్నాయి. ఈసారి ఆటో షోలో మల్టీపర్పస్ కార్లు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రతి సంవత్సరం మాదిరిగానే నమస్తే తెలంగాణ నిర్వహించిన ఆటోషోతో చాలా మంచి స్పందన వచ్చింది. ప్రచారం బాగా చేస్తున్నారు. మొదటి రోజే బైక్ బుకింగ్స్ చేశాం. రూ. 75వేల ఎక్స్ఎల్ నుంచి రూ.3 లక్షల వరకు ధర పలికే బైక్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 10మాడల్స్ ఉన్నాయి.
గతంలో ఆటోషోలను ఇంత అద్భుతంగా పెట్టలేకపోయారు. మల్టీ బ్రాండ్ కార్లు రావడం సంతోషకరం. ఇప్పటి వరకు చాలా మంది మా కంపెనీ కార్లను టెస్ట్డ్రైవ్ చేశారు. మా వద్ద రూ.8.7లక్షల నుంచి రూ. 25.79 లక్షల వరకు ధర ఉన్న వాహనాలు ఉన్నాయి.
అన్ని కంపెనీలకు చెందిన వాహనాలు ఒకే వేదిక వద్ద ఉండడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి సులభం అవుతుంది. చాలా విశాలంగా ఆటోషో ఏర్పాటు చేయడంతో చాలా మంది వచ్చారు. ఇప్పటి వరకు 25మంది వాహనాల గురించి తెలుసుకున్నారు. ఓ కారును బుక్ చేశారు.
ఆటోషో అద్భుతమైన ప్రదర్శన. చాలా బాగున్నది. మొదటి రోజే ఒక బైక్ డెలివరీ చేశాం. 16 ఎంక్వైరీస్ జరిగాయి. 8మాడల్స్లో రూ. 85వేల నుంచి రూ. 1.85లక్ష వరకు ధర పలుకుతున్నాయి.
చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 100మంది వరకు షోరూంకి వెళ్లి ఎంక్వైరీస్ చేసుకున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో మంచి ఆదరణ వచ్చింది. నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషోకి పబ్లిసిటీ బాగా చేశారు. అందుకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని నిర్వహించాలి. మా కంపెనీలో మధ్యతరగతితోపాటు హైరేంజ్ కార్లు అందుబాటులో ఉన్నాయి.
చాలా అద్భుతంగా ఉన్నది. మంచి రెస్పాన్స్ ఉన్నది. ఆటోషోతో అన్నిరకాల కార్లు, బైక్లు వాటి ధరలు తెలిసేలా చేశారు. మల్టీ బ్రాండెడ్ కార్లు రావడం సంతోషకరం. మా కార్ల కోసం 30మంది వివరాలని తెలుసుకొని వెళ్లారు. కార్ల ప్రారంభ ధర రూ.6.06లక్షలు నుంచి రూ.21.28 లక్షల వరకు ఉన్నాయి.
ఆటో షో చాలా అద్భుతంగా ఉన్నది. ఈసారి ఒకటే బ్యాంక్ స్టాల్ ఏర్పాటు చేయడంతో చాలా మంది మా స్టాల్ను సందర్శించారు. రుణాల వివరాలు తెలుసుకున్నారు. ఎక్కువగా ఎలక్ట్ట్రికల్ వాహనాల కోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు.