ఆర్మూర్టౌన్, జనవరి 3: ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై పలువురు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం బలపరీక్ష జరగనున్నది. ఆ మేరకు అధికారులు సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఇరువర్గాల నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ల మద్దతును కూడగడుతూ క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36మంది కౌన్సిలర్లు ఉం డగా, బీఆర్ఎస్కు 30, బీజేపీ 5, ఎంఐఎం 1 కౌన్సిలర్లు ఉన్నారు. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టడంతో గురువారం నిర్వహించనున్న బలపరీక్ష సమావేశంపై ఉత్కంఠ నెలకొన్నది.
వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
రాజంపేట్, జనవరి 3, రాజంపేట సొసైటీ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ రమేశ్పై ఇటీవల కొందరు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానా నికి ప్రతిపాదించారు. ఈ మేరకు బలపరీక్ష కోసం బుధవారం సొసైటీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిర్ణీత సమయానికి సభ్యులు హాజరు కాలేదు. కోరం లేని కారణంగా అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు జిల్లా సహకార అధికారి భూమయ్య ప్రకటించారు.