బోధన్/నవీపేట,ఫిబ్రవరి 21: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం తక్కువ వడ్డీతో ఇస్తున్న రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సూచించారు. నవీపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో యూనియన్ బ్యాంక్ నవీపేట, బోధన్ బ్రాంచీ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ. 11కోట్ల రుణాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. యూబీఐ డీజీఎం హేమ్రామ్, ఏజీఎం శివకోటయ్య, ఏపీడీ రవీందర్, డీపీఎం నీలిమా కులకర్ణి, ఏపీఎం భూమేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలోని అప్నా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి, భోగ్ భండార్లో ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ జీవితం స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ఏసీపీ శ్రీనివాస్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రు నాయక్, నాయకులు పాల్గొన్నారు.